కారు ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దారి మైసమ్మ వార్షికోత్సవం, అన్నదానం

0
IMG-20260727-WA0047

కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,జూలై 27: జమ్మికుంట పట్టణంలోని హుజురాబాద్ రోడ్డులో గల పాల కేంద్రం వద్ద దారి మైసమ్మ అమ్మవారి మొదటి వార్షికోత్సవాన్ని జమ్మికుంట కారు ఓనర్స్ , డ్రైవర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. అసోసియేషన్ ప్రెసిడెంట్ యాంసాని శంకరయ్య నేతృత్వంలో వేద పండితులు, పూజారుల సమక్షంలో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి, పూజా కార్యక్రమాలను శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. ఈ పూజల అనంతరం సుమారు 200 మందికి పైగా భక్తులకు, స్థానికులకు వినూత్నంగా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆధ్యాత్మిక వాతావరణంలో సాగిన ఈ వేడుకల్లో కారు ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ నాయకులు, సభ్యులు మాచర్ల వినయ్ కుమార్, మహమ్మద్ రఫీక్, సమ్మయ్య, కొమురయ్య, మిరియాల రాజు, అక్బర్, రాజేష్, లచ్చన్నలతో పాటు పెద్ద సంఖ్యలో డ్రైవర్లు, స్థానికులు పాల్గొన్నారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed