జమ్మికుంట తహశీల్దార్కు ‘ఉత్తమ ఉద్యోగి’ పురస్కారం: కార్యాలయ సిబ్బంది సాదర అభినందనలు
కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,ఆగస్టు 15: జమ్మికుంట మండల తహశీల్దార్ ప్రజాహితాన్ని పరమావధిగా భావించి, అంకితభావంతో విధులు నిర్వహిస్తూ ‘ఉత్తమ ఉద్యోగి’ ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో నిరంతరం శ్రమిస్తూ, నిబద్ధతతో ఆయన అందిస్తున్న సేవలకు గాను ఈ అరుదైన గౌరవం దక్కింది.ఈ సందర్భంగా తహశీల్దార్ కార్యాలయ సిబ్బంది ఆయనకు హృదయపూర్వక అభినందనలు , శుభాకాంక్షలు తెలియజేశారు. లభించిన ఈ పురస్కారం ఆయన సేవా తత్పరతకు, సమర్థవంతమైన పాలనకు నిజమైన నిదర్శనమని సిబ్బంది కొనియాడారు. ఆయన సేవా ప్రస్థానం భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, ప్రజాసేవలో ముందడుగు వేయాలని మనస్పూర్తిగా ఆకాంక్షిస్తున్నట్లు కార్యాలయ ఉద్యోగులు పేర్కొన్నారు.

