హనుమకొండలో కాంగ్రెస్, NSUI ఉధృత నిరసన: ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం
హన్మకొండ,వి90 న్యూస్,జూలై 22: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అరెస్టును నిరసిస్తూ హనుమకొండ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ , NSUI ఆధ్వర్యంలో అశోక జంక్షన్ వద్ద కాంగ్రెస్ శ్రేణులు భారీ నిరసన కార్యక్రమం చేపట్టాయి. కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ విరుచుకుపడిన నాయకులు, అశోక జంక్షన్ వద్ద రస్తారోకో చేసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ నియంతృత్వ ధోరణి నశించాలంటూ కాంగ్రెస్, NSUI కార్యకర్తలు ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. దీంతో అశోక జంక్షన్ పరిసర ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొనగా, పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు.

