చేనేత సంఘం నూతన పాలకవర్గానికి మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ శుభాకాంక్షలు

0
IMG-20260619-WA0047

కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,జూన్ 19: జమ్మికుంట చేనేత సహకార సంఘం ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన నూతన పాలకవర్గ సభ్యులకు జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్) శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చేనేత కార్మికుల సంక్షేమం, వారి సర్వతోముఖాభివృద్ధి కోసం నూతనంగా ఎన్నికైన సంఘం మరింత సమర్థవంతంగా, బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆకాంక్షించారు. ఎంతో ప్రాముఖ్యత కలిగిన చేనేత రంగాన్ని బలోపేతం చేయడానికి , కార్మికుల పురోగతికి తమ వంతు పూర్తి సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తామని ఈ సందర్భంగా చైర్మన్ భరోసా ఇచ్చారు. ఏకగ్రీవంగా ఎన్నికై బాధ్యతలు స్వీకరించిన నూతన పాలకవర్గ సభ్యులు చేనేత కార్మికుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో చేనేత సహకార సంఘం నూతన అధ్యక్షులు ఉడుత రమేష్, సభ్యులు రాజేందర్, దామోదర్, రాజమౌళి, శ్రీను, సంధ్య, సరోజన, మల్లయ్య, శివతో పాటు చేనేత కార్మికులు, పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed