అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను హతమార్చిన భార్య
నాగర్ కర్నూల్,వి90 న్యూస్,జూన్ 28: మానవ సంబంధాలు మంటగలిసేలా, సమాజం సిగ్గుతో తలదించుకునేలా అల్లుడిపై మోజుతో ఓ భార్య కట్టుకున్న భర్తనే అత్యంత క్రూరంగా కడతేర్చిన ఘోర ఘటన నాగర్కర్నూల్ జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. మొదట భర్త గుండెపోటుతో సహజ మరణం పొందాడని అందరినీ నమ్మించి నాటకమాడినప్పటికీ, చివరకు పాపం పండి పోలీసుల విచారణలో అసలు నిజం బయటపడటంతో స్థానికులు ముక్కున వేలేసుకుంటున్నారు. నమ్మకద్రోహం, వివాహేతర సంబంధం నేపథ్యంలో జరిగిన ఈ దారుణ హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు జిల్లావ్యాప్తంగా సంచలనంగా మారాయి.నాగర్కర్నూల్ జిల్లా తిమ్మాజీపేట మండలం ఆవంచ గ్రామానికి చెందిన అమ్మపల్లి యాదయ్య, అలివేలు దంపతులకు ఒక కుమార్తె ఉంది. ఆ కుమార్తెను ఆంజనేయులు అనే వ్యక్తికి ఇచ్చి ఘనంగా వివాహం జరిపించారు. అయితే, ఇంటికి అల్లుడిగా వచ్చిన ఆంజనేయులతో అత్త అలివేలు వరుసలు మరచి అక్రమ సంబంధాన్ని పెట్టుకుంది. కన్న కూతురి జీవితాన్ని నాశనం చేస్తూ, అల్లుడితో సాగుతున్న భార్య రాసలీలల ఉదంతం కాస్తా భర్త యాదయ్యకు తెలిసింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన యాదయ్య.. భార్య అలివేలును, అల్లుడు ఆంజనేయులను పలుమార్లు తీవ్రంగా మందలించి హెచ్చరించాడు. ఈ విషయమై ఆ ఇంట్లో రోజువారీగా ఘర్షణలు, తీవ్రమైన గొడవలు జరుగుతుండేవి. తన శారీరక సుఖానికి, అక్రమ బంధానికి భర్త యాదయ్య పెద్ద అడ్డుగోడలా మారాడని భావించిన అలివేలు, ఎలాగైనా అతడిని శాశ్వతంగా వదిలించుకోవాలని ఒక క్రూరమైన పథకాన్ని రచించింది.ఈ క్రమంలోనే ఈ నెల 23న యాదయ్య తన ఇంట్లోనే అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. భర్త ప్రాణాలు అనంతవాయువుల్లో కలవగానే అలివేలు ఏమీ తెలియనట్టు నటిస్తూ.. ఆయనకు హఠాత్తుగా గుండెపోటు వచ్చిందని, అనారోగ్యంతోనే మరణించాడని కుటుంబ సభ్యులను, గ్రామస్తులను నమ్మించే ప్రయత్నం చేసింది. ఆమె మాటలను నిజమేనని నమ్మిన బంధువులు అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే అంత్యక్రియలకు ముందు సాంప్రదాయం ప్రకారం శవానికి స్నానం చేయించి, కొత్త దుస్తులు మారుస్తుండగా యాదయ్య శరీరంపై, ముఖ్యంగా మర్మాంగంపై కొన్ని తీవ్రమైన గాయాలు కనిపించాయి. యాదయ్య మృతిపై గట్టి అనుమానం రావడంతో ఆయన అన్న కుమారుడైన పరశురాములు వెంటనే తిమ్మాజీపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు. ప్రధానంగా భార్య అలివేలు ప్రవర్తనపై అనుమానంతో ఆమెను తమదైన శైలిలో విచారించగా, అసలు నిజం ఒప్పుకోక తప్పలేదు. అల్లుడితో తనకున్న వివాహేతర సంబంధానికి భర్త అడ్డుపడుతున్నాడనే కక్షతో, సమయం చూసి భర్త యాదయ్య వృషణాలు, మర్మాంగాలపై తీవ్రంగా పిసికి హత్య చేసినట్లు అలివేలు నిర్ధారించింది. అయితే యాదయ్య మరణించిన రోజే ఆయన కూతురు, అల్లుడు ఆంజనేయులు కూడా ఆవంచ గ్రామంలోని వారి ఇంటికి వచ్చి వెళ్లినట్లు స్థానికులు సమాచారం ఇవ్వడంతో, ఈ హత్యలో అల్లుడి పాత్రతో పాటు కూతురి ప్రమేయం కూడా ఉందేమోనని మృతుడి కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు నిందితురాలైన భార్య అలివేలును అరెస్ట్ చేసి, ఈ దారుణంలో అల్లుడు ఆంజనేయుల హస్తం ఎంతవరకు ఉందనే కోణంలో లోతుగా విచారణ జరుపుతున్నారు.

