ప్రజల రాకపోకలకు ఇబ్బంది కలగకుండా ఆర్‌ఓబీ పనులు చేపట్టాలి: మున్సిపల్ చైర్మన్ ప్రశాంత్

0
MixCollage-28-Apr-2026-07-21-PM-2777

కరీంనగర్, ఏప్రిల్ 28 (V90 NEWS) ; స్థానిక మున్సిపాలిటీ పరిధిలోని మడిపల్లి క్రాస్ వద్ద రైల్వే రోడ్ ఓవర్ బ్రిడ్జి (ROB) నిర్మాణ పనులపై మున్సిపల్ కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకుంది. మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ మొలగు ప్రశాంత్ కుమార్ (దిలీప్) అధ్యక్షతన నిర్వహించిన అత్యవసర సమావేశంలో ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఏకగ్రీవ తీర్మానం చేశారు.

నిబంధనలు పాటిస్తూనే నిర్మాణం:
భారతీయ రైల్వే నిబంధనల ప్రకారం ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు లెవల్ క్రాసింగ్ గేట్లను తొలగించి ఓవర్ బ్రిడ్జిలు నిర్మించాల్సి ఉంది. ఇందులో భాగంగా మడిపల్లి క్రాస్ గేటు వద్ద బ్రిడ్జి నిర్మాణానికి కౌన్సిల్ ఆమోదం తెలిపింది. అయితే, పనులు జరుగుతున్న సమయంలో ప్రజల రాకపోకలకు ఎటువంటి ఆటంకం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చైర్మన్ స్పష్టం చేశారు.

ముందు జాగ్రత్తల తర్వాతే గేటు మూసివేత:
బ్రిడ్జి పనులు పూర్తయిన తర్వాతే రైల్వే లెవల్ క్రాసింగ్ గేటును శాశ్వతంగా మూసివేయాలని, అంతవరకు ప్రత్యామ్నాయ మార్గాలను సిద్ధం చేయాలని కౌన్సిల్ సభ్యులు ఏకగ్రీవంగా నిర్ణయించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్ (DPR) మరియు ఇతర సాంకేతిక వివరాలను కాజీపేట రైల్వే జోన్ అధికారులు మున్సిపల్ కార్యాలయానికి అందజేయాలని చైర్మన్ కోరారు.

అభివృద్ధి అందరి బాధ్యత:
పట్టణ అభివృద్ధి మరియు ప్రజల సౌకర్యార్థం మున్సిపాలిటీ చిత్తశుద్ధితో పనిచేస్తుందని, ఇందులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని చైర్మన్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మున్సిపల్ మేనేజర్ జి. రాజిరెడ్డి, టి.పి.ఓ శ్రీధర్, సీనియర్ అసిస్టెంట్ వాణీ మరియు కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed