తెలంగాణలో పుష్కర శోభ: మే 21 నుంచి సరస్వతీ అంత్య పుష్కరాలు!

0
IMG-20260505-WA0043(1)

హైదరాబాద్/కాలేశ్వరం మే 05 : తెలంగాణ రాష్ట్రంలో ఆధ్యాత్మిక సందడి మొదలైంది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కాలేశ్వరం వేదికగా ఈ నెల మే 21వ తేదీ నుండి జూన్ 1వ తేదీ వరకు సరస్వతీ అంత్య పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ చేతుల మీదుగా పుష్కర వేడుకలు అధికారికంగా ప్రారంభం కానున్నాయి.పుష్కరాల నిర్వహణ కోసం ప్రభుత్వం ఏకంగా 30 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేయగా, దేవాలయ శాఖ అభివృద్ధి పనుల కోసం అదనంగా మరో 19 కోట్ల రూపాయలను విడుదల చేసింది. ఈ భారీ నిధులతో భక్తుల సౌకర్యార్థం స్నాన ఘట్టాల నిర్మాణం, మౌలిక వసతుల కల్పన వంటి పనులను అధికారులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తాగునీరు, వసతి, వైద్యం మరియు రవాణా పరంగా ఎలాంటి లోటుపాట్లు లేకుండా యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది.ఈ వేడుకలకు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశం నలుమూలల నుండి లక్షలాది మంది భక్తులు తరలివస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తుల భద్రత కోసం ప్రత్యేక పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేయడంతో పాటు, పవిత్ర స్నానాలు ఆచరించే ఘాట్ల వద్ద నిరంతర పర్యవేక్షణ ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధుల సమన్వయంతో కాలేశ్వరం తీరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకోబోతోంది.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed