హనుమాన్ జయంతి వేడుకల్లో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్
జమ్మికుంట ,వి90 న్యూస్ ,మే 12 : పట్టణంలోని గణేష్ నగర్ సంజీవ హనుమాన్ దేవాలయంలో హనుమాన్ జయంతి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్ ) ఆలయాన్ని దర్శించి, స్వామి వారికి నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆంజనేయ స్వామి వారి కృపాకటాక్షాలతో జమ్మికుంట పట్టణ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. భక్తులందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున స్వామి, బూరుగుపల్లి రాము, చరణ్, రావికంటి రాజ్ కుమార్, పిట్టల రమేష్, జక్కే రవీందర్, అఖిలేష్తో పాటు అధిక సంఖ్యలో హనుమాన్ భక్తులు పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు.
