తర్లుపాడు మండలంలో రూ.15 కోట్లతో ఏర్పాటు చేసిన ఎంఎస్‌ఎంఈ ఇండస్ట్రియల్ పార్కును ప్రారంభించిన ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి, కలెక్టర్ విజయ సునీత

0
IMG-20260525-WA0042

ప్రకాశం,వి90 న్యూస్,మే 25: ప్రకాశం జిల్లా తర్లుపాడు మండల పరిధిలోని మేకలవారిపల్లి టోల్ ప్లాజా సమీపంలో ఏపీఐఐసీ ఆధ్వర్యంలో ప్రభుత్వం రూ.15 కోట్ల వ్యయంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ఎంఎస్‌ఎంఈ (MSME) ఇండస్ట్రియల్ పార్కును మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి , జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత సోమవారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కలుజువ్వలపాడు గ్రామ పరిసరాల్లో ఏర్పాటు చేసిన ఈ పారిశ్రామిక పార్కుతో వెనుకబడిన ఈ ప్రాంతంలో పారిశ్రామికాభివృద్ధికి బలమైన పునాది పడిందని హర్షం వ్యక్తం చేశారు. దీనికి తోడుగా కొనకనమిట్ల మండలంలో దాదాపు 3 వేల కోట్ల రూపాయల భారీ వ్యయంతో రిలయన్స్ బయోగ్యాస్ ప్లాంట్ నిర్మాణ పనులు ప్రస్తుతం అత్యంత చురుగ్గా సాగుతున్నాయని ప్రజాప్రతినిధులు, అధికారులు వెల్లడించారు. ఈ పారిశ్రామిక ప్రాజెక్టులు త్వరలోనే పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్నాయని, దీనివల్ల స్థానిక యువతకు వేలాది సంఖ్యలో ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ ఉపాధి అవకాశాలు లభిస్తాయని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ప్రాంత అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేసిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్థానిక మండల అధికారులు, తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed