పదో తరగతి పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన అడిషనల్ కలెక్టర్
కరీంనగర్ ఏప్రిల్ 7:
కరీంనగర్ లో మంగళవారం పలు 10వ తరగతి పరీక్ష కేంద్రాలను అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే మంగళవారం తనిఖీ చేశారు. తిరుమల్ నగర్ లోని తెలంగాణ మైనారిటీ బాలికల స్కూలు 2 , కోతి రాంపూర్ లోని సవరన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పదో తరగతి పరీక్ష కేంద్రాలను అడిషనల్ కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు పరీక్ష రాసే విధానాన్ని పరిశీలించారు. పరీక్షల నిర్వహణ విద్యార్థుల హాజరు అంశాలపై
విధులు నిర్వర్తిస్తున్న సిబ్బంది నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పదవ తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహిస్తున్నామని సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని అడిషనల్ కలెక్టర్ సూచించారు.
