శ్రీలక్ష్మీ నరసింహుడి సేవలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్
ధర్మపురి,ఏప్రిల్ 23:
ధర్మపురిలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారిని జగిత్యాల శాసన సభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గురువారం దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు,అధికారులు సంప్రదా యబద్ధంగా సాదర స్వాగతం పలికారు.స్వామివారిని దర్శించు కుని ప్రత్యేక పూజలు నిర్వహించి న అనంతరం, వేద పండితులు ఆయనకు ఆశీర్వచనం అందజే శారు.ఈ సందర్భంగా దేవస్థాన సూపరింటెండెంట్ కిరణ్ ఎమ్మెల్యేను శేషవస్త్రంతో సత్కరించి, స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ సీనియర్ అసిస్టెంట్ అల్వాల శ్రీనివాస్, ముఖ్య అర్చకులు నంబి శ్రీనివాసచార్యులు,అర్చకులు నంబి నరసింహమూర్తి, చక్రపాణి కిరణ్ కుమార్,సిబ్బంది పాల్గొన్నారు.
